- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీకి అమరావతి రాజధాని జేఏసీ లేఖ రాసింది. తమ పాదయాత్ర విజయవంతంగా పూర్తయ్యేందుకు జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి అమరావతి జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రధాని మోడీకి రాసిన లేఖను జేఏసీ నేతలు విడుదల చేశారు. హైకోర్టు అనుమతితో ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర చేపట్టామని పేర్కొన్నారు.
పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని.. కొన్ని సందర్భాల్లో లాఠీఛార్జ్ కూడా చేశారని లేఖలో ఆరోపించారు. అమరావతి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మూలిస్తోందన్నారు. అమరావతి ఆర్థిక అంశాల పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. రాజధానిగా అమరావతినే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానికి జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.
Next Story