వైసీపీ నేతలకు వణుకు పుట్టాలి : చంద్రబాబు

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఎక్కడా ఎన్టీఆర్ విగ్రహాలను తాకినా వైఎస్సార్ సీపీ నాయకులకు వణుకు పుట్టేలా చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. నెల్లూరులో ఎన్టీఆర్ విగ్రహం తొలగించడం పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కావలిలో విగ్రహం తొలగింపు ఘటనను బాబు దృష్టికి తేవడంతో మండిపడ్డారు. విగ్రహం తొలగింపును అంత తేలికగా వదిలేది లేదని హెచ్చరించారు. సీఎం చేతకాని […]

Update: 2020-07-21 05:32 GMT

దిశ, వెబ్ డెస్క్ :
రాష్ట్రంలో ఎక్కడా ఎన్టీఆర్ విగ్రహాలను తాకినా వైఎస్సార్ సీపీ నాయకులకు వణుకు పుట్టేలా చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. నెల్లూరులో ఎన్టీఆర్ విగ్రహం తొలగించడం పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కావలిలో విగ్రహం తొలగింపు ఘటనను బాబు దృష్టికి తేవడంతో మండిపడ్డారు. విగ్రహం తొలగింపును అంత తేలికగా వదిలేది లేదని హెచ్చరించారు. సీఎం చేతకాని తనం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని చెబుతున్న సీఎం.. తాను మాత్రం ఒక్కసారి కూడా మాస్క్ ధరించడం లేదని, అలాంటప్పుడు ఫైన్ ఎలా వేస్తాడని ప్రశ్నించారు.

Tags:    

Similar News