వైద్య రంగ నోబెల్ అవార్డులు ప్రకటన.. ఇద్దరిని వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం
2023 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డుల ప్రకటన మొదలైంది.
దిశ, డైనమిక్ బ్యూరో: 2023 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డుల ప్రకటన మొదలైంది. కొవిడ్ వ్యాక్సిన్పై చేసిన పరిశోధనలకు గానూ ఈ ఏడాది వైద్య రంగంలో బహుమతి వరించింది. కాటలిన్ కరికో, డ్రూ వెయిస్ మన్లకు ఈ ఏడాది వైద్యరంగంలో నోబెల్ అవార్డును ప్రకటించారు. ఈ మేరకు స్వీడన్లోని స్టాక్ హోంలో ఉన్న కరోలిన్ స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ బృందం వెల్లడించింది. కొవిడ్ కట్టడిలో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధికి చేసిన కృషికి గాను వీరికి ఈ అవార్డు వరించింది.