పాకిస్థాన్‌లో కలకలం: బాంబు దాడిలో ఐదుగురు పోలీసులు మృతి

వాయువ్య పాక్‌లో పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం 25 మంది పోలీసులు వెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకుని దుండగులు బాంబు దాడి చేశారు.

Update: 2024-01-08 08:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో మరో బాంబు పేలుడు సంభవించింది ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు మృతి చెందారు. వాయువ్య పాక్‌లో సోమవారం పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం 25 మంది పోలీసులు వెళ్తున్న ట్రక్కును లక్ష్యంగా చేసుకుని దుండగులు బాంబు దాడి చేశారు. దీంతో ఐదుగురు మృతి చెందగా.. మరో 20మందికి గాయాలైనట్టు బజౌర్ జిల్లా సీనియర్ ప్రభుత్వ అధికారి అన్వర్ ఉల్ హక్ తెలిపారు. క్షతగాత్రుల్లోనూ ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న బజౌర్ జిల్లాలోని మాముండ్‌లో ఈ అటాక్ జరగడం గమనార్హం. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ సంస్థ ప్రకటన చేయలేదు.

Tags:    

Similar News