ఇండోనేషియాలో మరోసారి పేలిన అగ్నిపర్వతం.. సునామీ హెచ్చరిక!

ఇండోనేషియా అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం చెందింది.

Update: 2024-04-30 12:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇండోనేషియా అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం చెందింది. రిమోట్ మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం మంగళవారం తెల్లవారుజామున 1:15 గంటలకు రెండు సార్లుకు పైగా పేలిందని అగ్నిపర్వత సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అధికారులు హైరిస్క్ హెచ్చరికలను జారీ చేశారు. సముద్రంలో లావా అధికంగా జారిపోతుండటంతో సునామీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వేలాది మంది ప్రజలను ఖాళీ చేయించారు. అగ్నిపర్వతం నుంచి ఐదు కిలోమీటర్ల (3.1 మైళ్ళు) కంటే ఎక్కువ బూడిదతో కమ్మేసింది. అధిక స్థాయిలో లావా బయటకు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి 11,000 నుండి 12,000 మందిని వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ప్రస్తుతం స్థానిక విపత్తు ఉపశమన సంస్థ, మిలిటరీ, పోలీసులు నివాసితులను ఖాళీ చేయిస్తున్నారు. సునామీ హెచ్చరిక కారణంగా పొరుగున ఉన్న తగులాండాంగ్ ద్వీపం నుండి ఉత్తరాన ఉన్న సియావు ద్వీపానికి వేలాది మందిని తరలించడంలో సహాయపడటానికి ఒక రెస్క్యూ షిప్, యుద్ధనౌకను పంపించారు. అగ్నిపర్వతం నుంచి వచ్చే వేడి మేఘాలు, లావా విపరీతంగా ఉండటంతో ప్రజలను రువాంగ్ చుట్టూ ఏడు కిలోమీటర్ల అవతల ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. ఇటీవల ఇండోనేషియాలో ఆరు సార్లకు పైగా అగ్నిపర్వత పేలుళ్లు సంభవించాయి.

Similar News