చౌటుప్పల్‌లో ప్రమాదవశాత్తు కార్మికుడి మృతి

దిశ, నల్లగొండ: యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండంలోని పరిశ్రమలో ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు మరణించాడు. మండల పరిధిలోని పంతంగి గ్రామంలో ఉన్న నైలీ లిమిటెడ్ పరిశ్రమలో జరిగింది. వివరాళ్లోకి వెళితే.. అదే గ్రామానికి చెందిన నందగిరి ఊషయ్య(40) గత పదేండ్లుగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి పరిశ్రమలో విధుల్లో ఉండగా పైనుంచి ఏదో వస్తువు తలపై పడి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పరిశ్రమ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో యాజమాన్యం మృతుడి కుటుంబానికి […]

Update: 2020-05-27 05:01 GMT

దిశ, నల్లగొండ: యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండంలోని పరిశ్రమలో ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు మరణించాడు. మండల పరిధిలోని పంతంగి గ్రామంలో ఉన్న నైలీ లిమిటెడ్ పరిశ్రమలో జరిగింది. వివరాళ్లోకి వెళితే.. అదే గ్రామానికి చెందిన నందగిరి ఊషయ్య(40) గత పదేండ్లుగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి పరిశ్రమలో విధుల్లో ఉండగా పైనుంచి ఏదో వస్తువు తలపై పడి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పరిశ్రమ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో యాజమాన్యం మృతుడి కుటుంబానికి పీఎఫ్‌తో సంబంధం లేకుండా రూ.35 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేందుకు అంగీకరించడంతో ధర్నా విరమించారు. మృతదేహం భార్య రోధించిన తీరు అందరినీ కంటనీరు తెప్పింది.

Tags:    

Similar News