తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన

దిశ, సంగారెడ్డి: మున్సిపాలిటీలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. 30, 33, 36వ వార్డుల మహిళలు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో సాయిబాబా కమాన్ వద్ద గురువారం ఖాళీ బిందెలతో బైఠాయించారు. కాంగ్రెస్ కౌన్సిలర్ల కారణంగానే తమ వార్డులపై చిన్నచూపు చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది తక్షణమే స్పందించి నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మహిళలు రోడ్డుపై నిరసన తెలియజేయడంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ జాం ఏర్పడింది.

Update: 2020-07-02 09:25 GMT

దిశ, సంగారెడ్డి: మున్సిపాలిటీలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. 30, 33, 36వ వార్డుల మహిళలు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో సాయిబాబా కమాన్ వద్ద గురువారం ఖాళీ బిందెలతో బైఠాయించారు. కాంగ్రెస్ కౌన్సిలర్ల కారణంగానే తమ వార్డులపై చిన్నచూపు చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది తక్షణమే స్పందించి నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మహిళలు రోడ్డుపై నిరసన తెలియజేయడంతో సుమారు గంటపాటు ట్రాఫిక్ జాం ఏర్పడింది.

Tags:    

Similar News