నిజామాబాద్‌లో తొలి బ్లాక్ ఫంగస్ మరణం

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తుంది. జీజీహెచ్ ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతూ బ్లాక్ ఫంగస్‌తో సోమవారం ఉదయం మహిళ మృతి చెందింది. మృతురాలు నగరంలోని గౌతంనగర్‌కు చెందిన మహిళగా గుర్తించారు. అయితే జీజీహెచ్‌‌లో ప్రత్యేక వార్డు ప్రారంభించిన మరుసటి రోజే తొలి మరణం సంభవిచడం కలకలం రేపుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్‌తో ఏడుగురు మరణించినట్టు అధికారికంగా గుర్తించారు. జిల్లాలో ఇప్పటివరకు 35 బ్లాక్ ఫంగస్ కేసులు […]

Update: 2021-05-31 01:19 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తుంది. జీజీహెచ్ ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతూ బ్లాక్ ఫంగస్‌తో సోమవారం ఉదయం మహిళ మృతి చెందింది. మృతురాలు నగరంలోని గౌతంనగర్‌కు చెందిన మహిళగా గుర్తించారు. అయితే జీజీహెచ్‌‌లో ప్రత్యేక వార్డు ప్రారంభించిన మరుసటి రోజే తొలి మరణం సంభవిచడం కలకలం రేపుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్‌తో ఏడుగురు మరణించినట్టు అధికారికంగా గుర్తించారు. జిల్లాలో ఇప్పటివరకు 35 బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం 50 పడకల బ్లాక్ ఫంగస్ వార్డులో ఏడుగురు బ్లాక్ ఫంగస్ చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News