బీజేపీ ఎమ్మెల్యే దాష్టికం.. భార్య అని కూడా చూడకుండా..

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్‌ప్రదేశ్‌ అధికార పార్టీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విశాల్‌ నెహ్రియా వివాదంలో చిక్కుకున్నారు. విశాల్‌ నెహ్రియా అదనపు కట్నం కోసం తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని అతని భార్య  ఓషిన్ శర్మ ఆరోపించారు. విశాల్‌ నెహ్రియా తనను పలుమార్లు శారీరకంగా, మానసికంగా హింసించాడని ఆరోపిస్తూ ఓషిన్‌ శర్మ శనివారం ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ గా మారింది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విశాల్‌ నెహ్రియా ఈ ఏడాది […]

Update: 2021-06-27 04:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్‌ప్రదేశ్‌ అధికార పార్టీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విశాల్‌ నెహ్రియా వివాదంలో చిక్కుకున్నారు. విశాల్‌ నెహ్రియా అదనపు కట్నం కోసం తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని అతని భార్య ఓషిన్ శర్మ ఆరోపించారు. విశాల్‌ నెహ్రియా తనను పలుమార్లు శారీరకంగా, మానసికంగా హింసించాడని ఆరోపిస్తూ ఓషిన్‌ శర్మ శనివారం ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ గా మారింది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విశాల్‌ నెహ్రియా ఈ ఏడాది ఏప్రిల్ లో తన స్నేహితురాలు ఓషిన్‌ శర్మ ను వివాహం చేసుకున్నాడు. ఇంతలోనే ఆమె భార్య అతనిపై ఆరోపణలు చేయడం స్థానికంగా సంచలనం రేపుతోంది.

ఇక వీడియోలో ఓషిన్ శర్మ మాట్లాడుతూ “అతనితో పెళ్లైన నాలుగు రోజులకే నాకు కరోనా వచ్చింది. దీంతో అతడు నన్ను నిర్దాక్షిణంగా బయటికి వెళ్ళగొట్టాడు. అప్పటినుంచి నేను నా పుట్టింట్లోనే ఉంటున్నాను” అంటూ తెలిపింది. నెహ్రియాతో తనకు కాలేజీ రోజుల నుంచే పరిచయముందనీ, అయితే, తనను కొడుతుండటంతో అప్పట్లోనే అతడితో తెగదెంపులు చేసుకున్నట్లు తెలిపిన ఓషిన్‌ శర్మ అత్తమామల బలవంతంతో అతనిని పెళ్లి చేసుకున్నట్లు వివరించింది. ఆ తర్వాత భర్త విశాల్ తో పాటు అత్తమామలు కూడా తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, వాటిని తట్టుకోలేక ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అదనపు కట్నం కోసం వేధించడం బీజేపీ లో ప్రకంపనలు రేపుతోంది.

Tags:    

Similar News