కేంద్ర ప్రభుత్వంపై మమతా బెనర్జీ ఫైర్

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యూటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం పిలువడంపై సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. దొడ్డిదారిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించాలనుకోవడం సిగ్గుమాలిన చర్యగా అభిర్ణించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె దుయ్యబట్టారు. ఇలాంటి చర్యలు సమాఖ్య వ్యవస్థ మౌలిక సూత్రాలకు పూర్తి విరుద్ధమని ఆక్షేపించారు. గత వారం పశ్చిమబెంగాల్ పర్యటనకు వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి […]

Update: 2020-12-17 09:04 GMT

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యూటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం పిలువడంపై సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. దొడ్డిదారిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించాలనుకోవడం సిగ్గుమాలిన చర్యగా అభిర్ణించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె దుయ్యబట్టారు. ఇలాంటి చర్యలు సమాఖ్య వ్యవస్థ మౌలిక సూత్రాలకు పూర్తి విరుద్ధమని ఆక్షేపించారు. గత వారం పశ్చిమబెంగాల్ పర్యటనకు వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటన తర్వాతి రోజు ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యూటేషన్‌పై రావాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. వారిని పంపించడానికి మమతా బెనర్జీ ప్రభుత్వం అంగీకరించలేదు. మరోసాకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేస్తూ వీలైనంత తర్వగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను రిలీవ్ చేయాలని కోరింది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News