నిత్యావసర సరుకులు అందించిన కార్పొరేటర్ పద్మావతి..
దిశ, గండిపేట్ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్ లో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని నిత్యవసర సరుకులను కార్పొరేటర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. తన వార్డులో మున్సిపల్ సిబ్బందికి అండగా ఉంటామన్నారు. వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నదిం, ఉస్మాన్, రాజు యాదవ్, […]
దిశ, గండిపేట్ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్ లో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని నిత్యవసర సరుకులను కార్పొరేటర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. తన వార్డులో మున్సిపల్ సిబ్బందికి అండగా ఉంటామన్నారు. వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నదిం, ఉస్మాన్, రాజు యాదవ్, భురాన్, సావిత్రి, అబుభకర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.