సేవా కార్యక్రమాల్లో ముందుంటాం…

దిశ ప్రతినిధి , హైదరాబాద్: సేవా కార్యక్రమాల్లో తాము ఎల్లప్పుడు ముందుంటామని టీఎన్‌జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేనీ తెలిపారు. నాంపల్లిలోని టీఎన్‌జీవో కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత పది రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వేలాది ఇండ్లల్లోకి వరద నీరు చేరిందని అన్నారు. తినడానికి దాచుకున్న ఆహార పదార్ధాలు సైతం నీటి పాలై దిక్కు తోచని స్థితిలో చాలా మంది ఉన్నారని అన్నారు. అటువంటి వారిని ఆదుకునేందుకు గాను […]

Update: 2020-10-21 09:13 GMT

దిశ ప్రతినిధి , హైదరాబాద్:
సేవా కార్యక్రమాల్లో తాము ఎల్లప్పుడు ముందుంటామని టీఎన్‌జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేనీ తెలిపారు. నాంపల్లిలోని టీఎన్‌జీవో కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత పది రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వేలాది ఇండ్లల్లోకి వరద నీరు చేరిందని అన్నారు. తినడానికి దాచుకున్న ఆహార పదార్ధాలు సైతం నీటి పాలై దిక్కు తోచని స్థితిలో చాలా మంది ఉన్నారని అన్నారు. అటువంటి వారిని ఆదుకునేందుకు గాను తన వంతు సాయంగా రూ 5 లక్షలను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు .

Tags:    

Similar News