ఆసిస్ గడ్డపై వాషింగ్టన్ సుందర్ ప్రపంచ రికార్డు
దిశ, వెబ్డెస్క్: గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. అయితే ఇవాళ జరిగిన మ్యాచ్లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. వాషింగ్టన్ సుందర్(62), శార్దూల్ ఠాకూర్(67) వీరోచిత అర్ధ సెంచరీలతో కంగారులకు చెమటలు పట్టించారు. అంతేగాకుండా టీమిండియా ఆటగాడు వాషింగ్టన్ సుందర్ దాదాపు 110 సంవత్సరాల రికార్డు బద్దలు కొట్టాడు. ఆసిస్ గడ్డపై […]
దిశ, వెబ్డెస్క్: గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. అయితే ఇవాళ జరిగిన మ్యాచ్లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. వాషింగ్టన్ సుందర్(62), శార్దూల్ ఠాకూర్(67) వీరోచిత అర్ధ సెంచరీలతో కంగారులకు చెమటలు పట్టించారు. అంతేగాకుండా టీమిండియా ఆటగాడు వాషింగ్టన్ సుందర్ దాదాపు 110 సంవత్సరాల రికార్డు బద్దలు కొట్టాడు. ఆసిస్ గడ్డపై ఆడిన తొలి టెస్టులోనే అత్యధిక పరుగులు(7) చేసిన ఆటగాడిగా సంచలనం సృష్టించాడు. దీంతో 1911లో ఆసిస్పై ఇంగ్లాండ్ తరపున అరంగేట్రం చేసిన ఫ్రాంక్ పోస్టర్ 56 పరుగుల రికార్డును సుందర్ అధిగమించాడు.