మెగా చాన్స్ రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో

మలయాళీ మూవీ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ రైట్స్‌ను రామ్ చరణ్ తేజ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ‘ఆచార్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్నారు. తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేర్పులు చేసి సినిమాను రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాలో జెనీలియా ముఖ్య పాత్ర పోషించబోతోందని టాక్ రాగా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తెరపైకి వచ్చింది. మలయాళీ లూసీఫర్ మూవీలో విలన్‌గా […]

Update: 2020-07-14 05:20 GMT

మలయాళీ మూవీ ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ రైట్స్‌ను రామ్ చరణ్ తేజ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ‘ఆచార్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్నారు. తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేర్పులు చేసి సినిమాను రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు.

ఇప్పటికే ఈ సినిమాలో జెనీలియా ముఖ్య పాత్ర పోషించబోతోందని టాక్ రాగా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తెరపైకి వచ్చింది. మలయాళీ లూసీఫర్ మూవీలో విలన్‌గా నటించిన వివేక్ ఒబెరాయ్‌నే తెలుగులోనూ నటించాలని కోరారట దర్శక, నిర్మాతలు. కానీ చేసిన క్యారెక్టర్‌నే మళ్లీ చేయలేనని.. సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. దీంతో నటుడు రహమాన్‌ను మెగాస్టార్ సినిమాలో విలన్‌గా ఫైనల్ చేసినట్లు సమాచారం.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News