విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం

దిశ, విశాఖపట్నం: ముంచింగిపుట్టు మండలం పనసపట్టు సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెదబయలు మండలం గుడుగుపల్లి గ్రామం నుంచి 20మంది భక్తులు ఒడిశాలోని కేందుగూగలో అమ్మవారి ఆలయానికి వెళ్తుండగా పనసపట్టు మలుపు వద్ద అదుపుతప్పి జీపు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 58ఏళ్ల కొర్ర సీతమ్మ ప్రాణాలు కోల్పోగా మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో లావణ్య అనే చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని […]

Update: 2020-11-24 07:38 GMT

దిశ, విశాఖపట్నం: ముంచింగిపుట్టు మండలం పనసపట్టు సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెదబయలు మండలం గుడుగుపల్లి గ్రామం నుంచి 20మంది భక్తులు ఒడిశాలోని కేందుగూగలో అమ్మవారి ఆలయానికి వెళ్తుండగా పనసపట్టు మలుపు వద్ద అదుపుతప్పి జీపు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 58ఏళ్ల కొర్ర సీతమ్మ ప్రాణాలు కోల్పోగా మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో లావణ్య అనే చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Similar News