ఆగమాగం ఎందుకు..నివేదిక ఇవ్వండి: విజయశాంతి

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే విషయం కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ట్వీట్ చేశారు. ‘సర్జికల్ స్ట్రైక్ అన్న అంశానికి సంబంధించి హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీల గురించి టీఆర్ఎస్, ఎంఐఎం ఇంత ఆగమాగం ఎందుకు అవుతున్నాయి? లేకుంటే ఎవరినైనా దాచిపెట్టడం వల్లనే భయాందోళనలకు టీఆర్ఎస్ గురవుతున్నదని ప్రజలు అభిప్రాయపడే అవకాశముంది. […]

Update: 2020-11-25 05:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే విషయం కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ట్వీట్ చేశారు. ‘సర్జికల్ స్ట్రైక్ అన్న అంశానికి సంబంధించి హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీల గురించి టీఆర్ఎస్, ఎంఐఎం ఇంత ఆగమాగం ఎందుకు అవుతున్నాయి? లేకుంటే ఎవరినైనా దాచిపెట్టడం వల్లనే భయాందోళనలకు టీఆర్ఎస్ గురవుతున్నదని ప్రజలు అభిప్రాయపడే అవకాశముంది. టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంటింటి సర్వే చేసిందని… పాతబస్తీలో ఆ విధంగా ఎవరూ లేరని… సీఎం గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి అధికారపూర్వక నివేదిక ఇవ్వచ్చు కదా? అంటూ విజయశాంతి సూచించారు.

Tags:    

Similar News