మడిపల్లి భద్రయ్యకు ఉపరాష్ట్రపతి అభినందనలు

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాకు చెందిన ప్రముఖ కవి మడిపల్లి భద్రయ్య గారికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందన పత్రాన్ని పంపించారు. మడిపల్లి భద్రయ్య గారు “మన భాష- మన యాస” పేరిట రాసిన భాషా పదకోశం, బ్రతుకు బాట శ్రీరామ చరిత్రము, శ్రీ వాసర జ్ఞాన సరస్వతీ స్తవం.. తదితర పుస్తకాలు పరిశీలించినట్లు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇంత చక్కటి పుస్తకాలను తనకు అందించినందుకు అభినందనలు తెలిపారు. తన పుస్తకాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందుకుని, చదివి స్పందించినందుకు […]

Update: 2021-03-10 05:03 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాకు చెందిన ప్రముఖ కవి మడిపల్లి భద్రయ్య గారికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందన పత్రాన్ని పంపించారు. మడిపల్లి భద్రయ్య గారు “మన భాష- మన యాస” పేరిట రాసిన భాషా పదకోశం, బ్రతుకు బాట శ్రీరామ చరిత్రము, శ్రీ వాసర జ్ఞాన సరస్వతీ స్తవం.. తదితర పుస్తకాలు పరిశీలించినట్లు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

ఇంత చక్కటి పుస్తకాలను తనకు అందించినందుకు అభినందనలు తెలిపారు. తన పుస్తకాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందుకుని, చదివి స్పందించినందుకు మడిపల్లి భద్రయ్య గారు హర్షం వ్యక్తం చేశారు.

 

Tags:    

Similar News