‘ఉప ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలి’

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాగా దీనిపై ఇప్పటికే పలు పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. తాజాగా శుక్రవారం ఇందిరా భవన్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి, చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ… దుబ్బాక ఉప ఎన్నికను […]

Update: 2020-09-11 04:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాగా దీనిపై ఇప్పటికే పలు పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. తాజాగా శుక్రవారం ఇందిరా భవన్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి, చర్చించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ… దుబ్బాక ఉప ఎన్నికను చారిత్రాత్మకంగా భావిస్తున్నామన్నారు. ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నామని, కాంగ్రెస్ శ్రేణులు ఏకతాటిపైకి రావాలన్నారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించామని.. త్వరలోనే అభ్యర్థిని ఖరారు చేస్తామని అన్నారు. కార్యకర్తలు ఎవరు నిలబడితే బాగుంటుందనేది సూచించాలని అన్నారు.

Tags:    

Similar News