మోడీకి భయపడటానికి నేను సీఎంను కాదు.. కలైజ్ఞర్ మనవడిని.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీనియర్లంటే ప్రధాని మోడీకి ఏమాత్రం గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ టార్చర్ వల్లే బీజేపీ కీలక నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు చనిపోయారని ఆసక్తిరక వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య నాయుడు లాంటి సీనియర్ నేతలను ఉద్దేశపూర్వకంగానే యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పక్కకు […]

Update: 2021-04-01 23:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీపై డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీనియర్లంటే ప్రధాని మోడీకి ఏమాత్రం గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ టార్చర్ వల్లే బీజేపీ కీలక నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు చనిపోయారని ఆసక్తిరక వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య నాయుడు లాంటి సీనియర్ నేతలను ఉద్దేశపూర్వకంగానే యాక్టివ్ పాలిటిక్స్ నుంచి పక్కకు తప్పించారని ఆరోపించారు. ‘వాళ్లందరినీ మీరు పక్కకు తప్పించి ఉండవచ్చు. కానీ మీకు భయపడేందుకు నేనేమీ సీఎం పళనిస్వామిని కాదు.. ఉదయ నిధి స్టాలిన్‌ను… కలైజ్ఞర్ మనవడిని’ అని ఉదయని నిధి స్టాలిన్ వెల్లడించారు.

అయితే.. స్టాలిన్ వ్యాఖ్యలకు సుష్మా, జైట్లీ కుటుంబసభ్యులు స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించారు. స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సుష్మా కుమార్తె బన్సూరి స్వరాజ్ కౌంటర్ ఇస్తూ.. ‘ఉదయనిధి స్టాలిన్ గారు… మీ ఎన్నికల ప్రచారంలోకి మా అమ్మను లాగకండి. మీవి తప్పుడు ఆరోపణలు. ప్రధాని నరేంద్ర మోదీ నా తల్లికి ఎంతో గౌరవమిచ్చారు. మేము కష్ట కాలంలో ఉన్న సమయంలో ప్రధానితో పాటు బీజేపీ మాకు అండగా నిలిచింది.’ అని బన్సూరి స్వరాజ్ పేర్కొన్నారు. ప్రధానిని టార్గెట్ చేసేందుకు తన తల్లిని, అరుణ్ జైట్లీని అగౌరవపరిచేలా మాట్లాడటం అత్యంత నీచమైన చర్య అని మండిపడ్డారు. జైట్లీ కుమార్తె సోనాలి జైట్లీ ఉదయ నిధికి కౌంటర్ ఇచ్చారు. అంతేగాకుండా.. స్టాలిన్ వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Tags:    

Similar News