ఘోర రోడ్డు ప్రమాదం.. రోడ్డుపై మహిళ మెదడు బయటకు వచ్చి..

దిశ, కామారెడ్డి : సదాశివనగర్ మండలం పద్మాజీవాడి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వస్తున్న ఆటోను వెనక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళను ప్రమాద స్థలం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోడల్ స్కూల్ వరకు లారీ తోసుకెళ్లింది. ప్రస్తుతం ఆ మహిళ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల ప్రకారం.. […]

Update: 2021-06-13 06:15 GMT

దిశ, కామారెడ్డి : సదాశివనగర్ మండలం పద్మాజీవాడి చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వస్తున్న ఆటోను వెనక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళను ప్రమాద స్థలం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోడల్ స్కూల్ వరకు లారీ తోసుకెళ్లింది. ప్రస్తుతం ఆ మహిళ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామానికి చెందిన 12 మంది.. ఒకే ఆటోలో నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్‌పూర్ గ్రామంలో అంత్యక్రియలకు బయలుదేరారు. అంత్యక్రియలు పూర్తి చేసుకుని.. ఆటోలో తిరిగి వస్తున్న క్రమంలో.. సదాశివనగర్ మండలం పద్మాజీవాడి చౌరస్తా వరకు రాగానే వెనక నుంచి వస్తున్న లారీ ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన గడ్డం మమత(40) తలపై నుంచి లారీ టైర్ వెళ్లడంతో తల నుజ్జునుజ్జయి అక్కడే మృతి చెందింది. మరో మహిళ గడ్డం లక్ష్మీ(36)ని చౌరస్తా నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోడల్ స్కూల్ వరకు లారీ తోసుకుపోయింది.

అనంతరం లక్ష్మీని జిల్లా ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారందరికీ జిల్లా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags:    

Similar News