కడపలో ఘోర ప్రమాదం… స్పాట్‌లో ఇద్దరు మృతి

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాలోని నగరవనం సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు లారీని ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులను పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

Update: 2020-09-20 21:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాలోని నగరవనం సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు లారీని ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులను పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News