టీఆర్ఎస్ సీనియర్ నేత కన్నుమూత

దిశ ప్రతినిధి, ఖమ్మం: టీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు బుడాన్ బేగ్ కన్నుమూశారు. కొంత కాలం క్రితం కరోనా బారిన పడిన బేగ్ వారం రోజులుగా బెంగళూరులో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతిచెందారు. కాగా, బేగ్ మృతి పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేశారని, కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఎదిగారని, వారి మరణం పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబానికి తమ […]

Update: 2021-05-17 09:05 GMT

దిశ ప్రతినిధి, ఖమ్మం: టీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు బుడాన్ బేగ్ కన్నుమూశారు. కొంత కాలం క్రితం కరోనా బారిన పడిన బేగ్ వారం రోజులుగా బెంగళూరులో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతిచెందారు. కాగా, బేగ్ మృతి పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేశారని, కార్యకర్త నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఎదిగారని, వారి మరణం పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. బేగ్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

Tags:    

Similar News