కేకేను బురిడి కొట్టించిన కేటీఆర్ పేరు

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్ పేరు చెప్పిన ఓ కేటుగాడు టీఆర్ఎస్ ఎంపీ కేకేను బురిడి కొట్టించాడు. కేంద్ర పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మహేశ్ పేరుతో ఎంపీ కేశవరావుకు కాల్ వచ్చింది. కాల్ స్వీకరించిన కేకేకు.. 25 మంది నిరుద్యోగులకు రూ. 25 లక్షల రుణం ఇస్తున్నామని మహేశ్ చెప్పాడు. అయితే, కేటీఆర్ కాల్ చేయమంటేనే చేశామని నమ్మ బలికాడు. దీంతో కేకే తన కూతురు, కార్పొరేటర్ విజయలక్ష్మీని సంప్రదించాలని సూచించారు. మహేశ్ విజయలక్ష్మీకి కూడా కాల్ […]

Update: 2020-08-26 05:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్ పేరు చెప్పిన ఓ కేటుగాడు టీఆర్ఎస్ ఎంపీ కేకేను బురిడి కొట్టించాడు. కేంద్ర పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మహేశ్ పేరుతో ఎంపీ కేశవరావుకు కాల్ వచ్చింది. కాల్ స్వీకరించిన కేకేకు.. 25 మంది నిరుద్యోగులకు రూ. 25 లక్షల రుణం ఇస్తున్నామని మహేశ్ చెప్పాడు. అయితే, కేటీఆర్ కాల్ చేయమంటేనే చేశామని నమ్మ బలికాడు. దీంతో కేకే తన కూతురు, కార్పొరేటర్ విజయలక్ష్మీని సంప్రదించాలని సూచించారు.

మహేశ్ విజయలక్ష్మీకి కూడా కాల్ చేసి కేశవరావుకు చెప్పిన విషయమే చెప్పాడు. దీంతో ఆమె ఓ 25 మంది నిరుద్యోగులను ఎంపిక చేశారు. ఆ తర్వాత మహేశ్‌ను సంప్రదించాలని సూచించారు. నిరుద్యోగులు మహేశ్‌కు కాల్ చేయడంతో లోన్ ప్రాసెసింగ్ ఫీజ్ కింద రూ. లక్షా 25 వేలను డిమాండ్ చేశాడు.

దీంతో ఓ నిరుద్యోగి అఖిల్ రూ. 50 వేలను మహేశ్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ విషయం కాస్తా కేకేకు తెలియడంతో.. అనుమానం వచ్చి కేంద్ర పరిశ్రమల శాఖ కాల్ చేసి ఆరా తీశాడు. అసలు మహేశ్ అనే వ్యక్తి తమ శాఖలో పని చేస్తాలేడని తెలపడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అఖిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News