సీఎం రేవంత్ వ్యాఖ్యలు దుమారం! అసలు ఏం అన్నారో తెలుసా?

బీజేపీ నేతలు రేషన్ బియ్యం తీసుకొచ్చి అయోధ్య రాముని అక్షింతలంటూ పంచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి.

Update: 2024-05-06 12:32 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ నేతలు రేషన్ బియ్యం తీసుకొచ్చి అయోధ్య రాముని అక్షింతలంటూ పంచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాజాగా రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కాకముందే రేషన్ బియ్యానికి పసుపు కలిపి గ్రామాల్లో పంచారు. అబద్దాలతో ప్రజలను మోసం చేశారు. దేవుడిని అడ్డం పెట్టుకుని ఓట్లు కొల్లగొట్టారని చూస్తున్నారు’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పై తీవ్ర ఆరోపణలు చేశారు.

దీనిపై నెటిజన్లు, బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నాయి. అయోధ్య శ్రీరామ అక్షతలపై ఎందుకు విమర్శలు చేస్తున్నారు? పేదల తినే రేషన్ బియ్యం అంటే మీకు అంత చులకన ఎందుకు? అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. దేవుడిని అడ్డం పెట్టుకుని కాదు.. దేవుడి ఆశీర్వాదంతో రాజకీయం చేస్తున్నాం.. అయోధ్య రాముడి గురించి కాంగ్రెస్‌కు మాట్లాడే అర్హత లేదని బీజేపీ శ్రేణులు కామెంట్ చేస్తున్నాయి.

Click Here For Twitter Post

Tags:    

Similar News