నేడు కరోనాపై జగన్ ఉన్నతస్థాయి సమీక్ష

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొత్త కేసులు పదుల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. తాజాగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈనేపథ్యంలో సీఎం జగన్.. కోవిడ్-19 నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎస్ నీలం సాహ్నీ, డీజీపీ గౌతంమ్ సావాంగ్, వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. అనంతరం […]

Update: 2020-05-11 21:37 GMT

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొత్త కేసులు పదుల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. తాజాగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈనేపథ్యంలో సీఎం జగన్.. కోవిడ్-19 నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎస్ నీలం సాహ్నీ, డీజీపీ గౌతంమ్ సావాంగ్, వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 3 గంటలకు సీఎం ఆర్థిక శాఖపై సమీక్ష చేయనున్నారు.

Tags:    

Similar News