ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులు హతం

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లోని ఎల్‌వోసీ దగ్గర ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ వైపు నుంచి ఎల్‌వోసీ గుండా సోమవారం తెల్లవారుజామున మనదేశంలోకి చొచ్చుకువచ్చే యత్నం చేస్తున్న కొందరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ఉగ్రవాదులను అడ్డుకునేందుకు ఉపక్రమిస్తుండగా కలాల్ గ్రామ సమీపంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లోనే ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Update: 2020-06-01 10:16 GMT

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లోని ఎల్‌వోసీ దగ్గర ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ వైపు నుంచి ఎల్‌వోసీ గుండా సోమవారం తెల్లవారుజామున మనదేశంలోకి చొచ్చుకువచ్చే యత్నం చేస్తున్న కొందరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ఉగ్రవాదులను అడ్డుకునేందుకు ఉపక్రమిస్తుండగా కలాల్ గ్రామ సమీపంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లోనే ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Tags:    

Similar News