ఒకే కుటుంబంలో ముగ్గురు దారుణ హత్య

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం మధురవాడలో ఎన్ఆర్ఐ కుటుంబం ఘటన మరవకముందే కడపలో మరో ఘటన జరిగింది. కడప జిల్లా ప్రోద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ముగ్గురిని హత్యచేశాడు. ఇంటికి పెద్ద కొడుకైన కరీముల్లా తన తల్లి చెల్లి , తమ్ముడిని అతికీరతకంగా హత్యచేసి, అనతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. వివరాల ప్రకారం.. కరీముల్లా కు తన భార్యకు కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే వారిద్దరి విషయంలో […]

Update: 2021-04-25 22:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం మధురవాడలో ఎన్ఆర్ఐ కుటుంబం ఘటన మరవకముందే కడపలో మరో ఘటన జరిగింది. కడప జిల్లా ప్రోద్దుటూరులో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ముగ్గురిని హత్యచేశాడు. ఇంటికి పెద్ద కొడుకైన కరీముల్లా తన తల్లి చెల్లి , తమ్ముడిని అతికీరతకంగా హత్యచేసి, అనతరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

వివరాల ప్రకారం.. కరీముల్లా కు తన భార్యకు కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే వారిద్దరి విషయంలో తన తల్లి, తమ్ముడు, చెల్లి సహాకరించాలని వారితో ఇంట్లో రోజూ గొడవలు పెట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యలో సోమవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చి నిద్రిస్తున్న తన తల్లి, తమ్ముడు, చెల్లిని రోకలి బండతో దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన పై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News