4రోజుల్లో కోవ్యాక్సిన్‌ మూడో దశ పరీక్షలు

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి టీకా తయారు చేస్తున్న భారత్ బయోటెక్ మూడో దశ పరీక్షలు 4రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఐసీఎంఆర్ నుంచి అనుమతులు రావడంతో మూడో దశ పరీక్షలు జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో రేపు నిమ్స్‌ ఎథిక్స్ కమిటీ కూడా సమావేశం కానుంది. దాదాపు 100 నుంచి 200మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుండగా డిసెంబర్ చివరి వరకు మూడో దశ […]

Update: 2020-10-26 10:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి టీకా తయారు చేస్తున్న భారత్ బయోటెక్ మూడో దశ పరీక్షలు 4రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఐసీఎంఆర్ నుంచి అనుమతులు రావడంతో మూడో దశ పరీక్షలు జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో రేపు నిమ్స్‌ ఎథిక్స్ కమిటీ కూడా సమావేశం కానుంది. దాదాపు 100 నుంచి 200మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుండగా డిసెంబర్ చివరి వరకు మూడో దశ పూర్తవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి వ్యాక్సిన్ తుది అనుమతులు పొంది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News