పట్టపగలే చోరీ

దిశ, హుస్నాబాద్: పట్టపగలే ఓ లైబ్రేరియన్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్సై సజ్జనపు శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..హుస్నాబాద్ పట్టణానికి చెందిన లైబ్రేరియన్ కోమటి నారాయణ దంపతులు తన కూతురు ఇంటికి మంగళవారం ఉదయం వెళ్లారు. మధ్యాహ్నం ఆ దంపతులు ఇంటికొచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని మూడు తులాల బంగారం, రూ.20వేలు నగదును దొంగిలించబడి నట్టు వారు […]

Update: 2020-10-06 11:14 GMT

దిశ, హుస్నాబాద్: పట్టపగలే ఓ లైబ్రేరియన్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్సై సజ్జనపు శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..హుస్నాబాద్ పట్టణానికి చెందిన లైబ్రేరియన్ కోమటి నారాయణ దంపతులు తన కూతురు ఇంటికి మంగళవారం ఉదయం వెళ్లారు. మధ్యాహ్నం ఆ దంపతులు ఇంటికొచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని మూడు తులాల బంగారం, రూ.20వేలు నగదును దొంగిలించబడి నట్టు వారు గుర్తించారు. దీంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్త జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News