మంత్రాలు చేస్తున్నాడనీ.. కత్తితో దాడి

దిశ, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్‌పూర్‌తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో నూనావత్ కిషన్ అనే వ్యక్తిపై స్థానికుడు నరసింహ కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాల పాలైన కిషన్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, నిందితుడు నరసింహను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2021-04-07 21:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్‌పూర్‌తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో నూనావత్ కిషన్ అనే వ్యక్తిపై స్థానికుడు నరసింహ కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాల పాలైన కిషన్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, నిందితుడు నరసింహను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News