విషాదం.. అనారోగ్యంతో వార్డు సభ్యురాలు కన్నుమూత

దిశ, నెక్కొండ : నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ పాలక వర్గంలోని 12వ వార్డు సభ్యురాలు భూక్య భద్రమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. భద్రమ్మ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఇటీవల కరుణాపురం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీలో 12వ వార్డు సభ్యురాలుగా భద్రమ్మ ప్రస్తుతం కొనసాగుతున్నారు. అకాల మృతి పట్ల నెక్కొండ […]

Update: 2021-11-14 10:42 GMT

దిశ, నెక్కొండ : నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీ పాలక వర్గంలోని 12వ వార్డు సభ్యురాలు భూక్య భద్రమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. భద్రమ్మ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఇటీవల కరుణాపురం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీలో 12వ వార్డు సభ్యురాలుగా భద్రమ్మ ప్రస్తుతం కొనసాగుతున్నారు. అకాల మృతి పట్ల నెక్కొండ సర్పంచ్ సొంటి రెడ్డి యమునా రంజిత్ రెడ్డి.. భద్రమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags:    

Similar News