పోలీసుల వేధింపులు తాళలేక.. ఈ పనిచేశా

దిశ ప్రతినిధి, నిజామాబాద్:  పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక మహిళ మిస్సింగ్ కేసులో నాగరాజును పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ పేరుతో వేధిస్తున్నారన్నారు.  పోలీసుల వేధింపులు తాళలేకనే తాను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితుడు తెలిపారు. ప్రస్తుతం నాగరాజు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే,  దీనిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని  విచారణ […]

Update: 2021-03-18 03:22 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక మహిళ మిస్సింగ్ కేసులో నాగరాజును పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ పేరుతో వేధిస్తున్నారన్నారు. పోలీసుల వేధింపులు తాళలేకనే తాను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధితుడు తెలిపారు. ప్రస్తుతం నాగరాజు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, దీనిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News