40 ఏళ్లుగా ఈ భూమి పైనే ఆధారపడ్డాం.. మాపై దయ చూపండి సార్..

దిశ, కంది: తాతల కాలం నుంచి ఈ భూమి పైనే ఆధారపడి జీవిస్తున్నమని ఈ విషయాన్ని గమనించి latest telugu news..

Update: 2022-03-10 16:46 GMT

దిశ, కంది: తాతల కాలం నుంచి ఈ భూమి పైనే ఆధారపడి జీవిస్తున్నమని ఈ విషయాన్ని గమనించి అధికారులు తమ గోడును విని తమకు చేయాలని భూ నిర్వాసితులు వేడుకుంటున్నారు.

ఉపాధి కోల్పోయి రోడ్డున పడతాం..

కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామానికి చెందిన చాకలి రాములు, చాకలి గోపాల్, చాకలి వెంకయ్య కి గత 40 ఏళ్లుగా గంగారం రోడ్డు పక్కన సర్వే నెంబర్ 215 లో కొంత స్థలం ఉంది. వ్యవసాయం, ఇతర ఆధారాలు లేకపోవడంతో కొద్ది నెలల క్రితం కులవృత్తి కోసం రేకుల షెడ్డు వేసుకోవడం జరిగింది. అయితే పంచాయతీ కార్యదర్శి ద్వారా తమకు నోటీసులు ఇచ్చారని, కూల్చి వేస్తామని చెబుతున్నారని బాధితులు గురువారం వాపోయారు. ఇదే విషయమై గతంలో ఎంపీడీవో తో పాటు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమపై దయతలచి ఉపాధి కోసం వేసుకున్న రేకుల షెడ్డు ను కూల్చి వేయకుండ న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News