బిగ్ బ్రేకింగ్... ఎంపీ పదవికి రాజీనామా చేసిన ప్రముఖ నేత

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు...UP: Akhilesh Yadav Quits As MP

Update: 2022-03-22 09:07 GMT

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తన కుటుంబ కంచుకోట అయిన కర్హాల్ నుంచి అఖిలేష్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. అఖిలేష్ యాదవ్ తూర్పు యూపీలోని అజంగఢ్ నుంచి ఎంపీగా ఉన్నారు. 2027 యూపీ ఎన్నికలపై దృష్టి సారించి, అసెంబ్లీలో బీజేపీని ఎదుర్కోవాలని ఆయన యోచిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. యూపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం చేజిక్కించుకోగా, సమాజ్ వాదీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. 




 


 


 


Tags:    

Similar News