టీ20 మ్యాచ్ జరుగుతుండగా సూసైడ్ బాంబ్ బ్లాస్ట్.. అక్కడ దాక్కున్న ప్లేయర్స్
దిశ, వెబ్డెస్క్: టీ20 టోర్న్మెంట్ జరుగుతుండగా భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దీంతో స్టేడియంలోని వారంతా
దిశ, వెబ్డెస్క్: టీ20 టోర్న్మెంట్ జరుగుతుండగా భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దీంతో స్టేడియంలోని వారంతా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ టీ20 టోర్న్మెంట్ జరుగుతుండగా చోటుచేసుకుంది. ఈ సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ జరగడంతో ఆటగాళ్లంతా బంకర్లలో తలదాచుకున్నారు. అమీర్ డ్రాగన్స్, పామిర్ జల్మీ జట్ల మ్యాచ్ మధ్యలో ఈ బాంబ్ పేలుడు జరిగింది. ఆ సమయంలో యునైటెడ్ నేషన్స్ అధికారులు కూడా స్టేడియంలో ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ మేరకు విషయం సంచలనంగా మారుతుంది. యునైటెడ్ నేషన్స్ అధికారులు టార్గెట్గానే ఈ పేలుడు జరిగిందని, ఈ సూసైడ్ బాంబు పేలుడుతో తాలిబన్లు యునైటెడ్ నేషన్స్కు వార్నింగ్ ఇస్తున్నారంటూ నెటిజన్లు తమతమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. మరి దీనిపై ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.