వారికి తెల్లగా ఉంటే చాలు.. ఇండస్ట్రీపై రాశీఖన్నా షాకింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీపై పలువురు హీరోయిన్ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.- latest Telugu news

Update: 2022-03-30 11:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీపై పలువురు హీరోయిన్స్ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలుగు సినిమాల్లో నటించి.. ఇక్కడ కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుని.. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో తాప్సీ.. మొన్న పూజా హెగ్డే.. నేడు రాశీఖన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో తాప్సీ.. ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావుపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాశీఖన్నా సౌత్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలపై అభిమానులు మండిపడుతున్నారు. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రాశీ.. స్టార్ హీరోల సరసన నటించిన ఇక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందుకోలేదు ఈ ఢిల్లీ భామ.

దీనితో రాశీఖన్నా.. బాలీవుడ్‌పై ఫోకస్ చేసింది. 'రుద్ర' అనే వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. ఈ సందర్భంగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది రాశీఖన్నా. 'సౌత్‌లో తెల్లగా, అందగా ఉంటే చాలని.. టాలెంట్‌తో వారికి పని లేదని పేర్కొంది. టాలీవుడ్ కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్‌లు హీరోల పక్కన కాసేపు కనిపించడం.. కొన్ని పాటల్లో మెరవడం అంతకుమించి ఏమి ఉండదని చెప్పింది ఈ ఢిల్లీ భామ. హీరోయిన్ పాత్రలకు స్కోప్ ఉండదని.. కెరీర్ మొదట్లో సౌత్ ప్రేక్షకుల నన్ను గ్యాస్ ట్యాంకర్ అని పిలిచేవారని గుర్తు చేసుకుంది రాశీఖన్నా. ఈ వ్యాఖ్యలపై సౌత్ ప్రేక్షకులు మండిపడుతున్నారు.




Tags:    

Similar News