పండుగ వేళ ప్రయాణికుల తంటాలు..

దిశ, హైదరాబాద్: పండుగ వచ్చిందంటే చాలు బ్రతుకుదెరువు కోసం హైదరాబాద- latest Telugu news

Update: 2022-04-01 14:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: పండుగ వచ్చిందంటే చాలు బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ వలసొచ్చిన కార్మికుల నుంచి ఉన్నతవిద్య కోసం వచ్చిన విద్యార్థులు, ఉద్యోగస్థులు సొంతూరికి వెళ్తుంటారు. ఇదంతా ఎప్పుడూ జరిగే వ్యవహారమే. ఒకరకంగా చెప్పాలంటే రోజురోజుకు సిటీ విస్తరిస్తోంది. పండుగకు సొంతూరికి వెళ్ళేవారి సంఖ్య పెరుగుతోంది. అయిన ఆర్టీసీ వారు మాత్రం బస్సుల సంఖ్యను పెంచడం లేదు. ఉగాది సందర్భంగా సొంతరూకి వేల సంఖ్యలో ప్రయాణికులు ప్రయణమయ్యారు. అయితే, ఎంతకీ బస్సులు రాకపోవడంతో చిన్నపిల్లలను భుజాన వేసుకుని తల్లిదండ్రులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రయాణికులకు తగ్గట్లు బస్సులు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News