14న మండలి చైర్మన్ ఎన్నిక.. గుత్తా నామినేషన్ అప్పుడే?

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 14వ తేదీన ఉదయం 11 గంటలకు శాసన మండలి చైర్మన్ ఎన్నిక జరుగనున్నది.

Update: 2022-03-12 09:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 14వ తేదీన ఉదయం 11 గంటలకు శాసన మండలి చైర్మన్ ఎన్నిక జరుగనున్నది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఎన్నికకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 13వ తేదీన 10:30 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు నామినేషన్లు వేయడానికి అవకాశం ఉంది. ఆదివారం ఉదయం 10:30 గంటలకు మండలి ఛైర్మన్ పదవికి నామినేషన్‌ను గుత్తా సుఖేందర్ రెడ్డి వేయనున్నారు.

Tags:    

Similar News