మండలిలో చిడతలు వాయించిన టీడీపీ సభ్యులు.. మంత్రి కన్నబాబు సీరియస్

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు గందరగోళంగా కొనసాగుతున్నాయి.

Update: 2022-03-24 05:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు గందరగోళంగా కొనసాగుతున్నాయి. రెండోరోజు మండలిలో చిడతలు వాయిస్తూ, విజిల్స్ వేసిన టీడీపీ సభ్యులపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌ ప్రకటించారు. సస్పెండైన వారిలో అర్జునుడు, అశోక్‌ బాబు, దీపక్‌ రెడ్డి, ప్రభాకర్‌, రామ్మోహన్‌, రామారావు, రవీంద్రనాథ్‌ ఉన్నారు. అనంతరం మంత్రి కన్నబాబు మట్లాడుతూ.. టీడీపీ సభ్యులు ఈ స్థాయిలో దిగజారిపోయారని అస్సలు ఊహించలేదని వ్యాఖ్యానించారు. మండలిలో టీడీపీ సభ్యులు బిచ్చగాళ్లలా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దల సభలో చిల్లరగా గలాటా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బయటనుంచి సభను కంట్రోల్‌ చేయాలని చూస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News