నా రాజీనామాను ఆమోదించండి.. స్పీకర్కు గంట లేఖ
తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ.. మరోసారి స్పీకర్ తమ్మినేని సీతారాంకు విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు.
దిశ, ఉత్తరాంద్ర : తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ.. మరోసారి స్పీకర్ తమ్మినేని సీతారాంకు విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న తన శాసన సభ్యత్వానికి గంటా రాజీనామా చేశారు. అయితే ఏడాది దాటినా తన రాజీనామాను ఆమోదించకపోవడంపై ఆవేదన చెందుతున్నట్లు లేఖలో గంటా పేర్కొన్నారు. ఏడాదికాలంగా పోరాడుతున్న నిర్వాసితులు, కార్మికుల పోరాటాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధ కలిగించిందన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని లేఖలో గంటా రాసుకొచ్చారు.
గత ఏడాదే రాజీనామా చేసిన గంట
గత ఏడాది ఫిబ్రవరి 21న గంటా శ్రీనివాస్రావు రాజీనామా చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనే స్పీకర్కు స్వయంగా రాజీనామా లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కు సంబంధించి కేంద్రం నిర్ణయం అమలులోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్ను గంటా కోరారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజకీయేతర జేఏసీని ఏర్పాటు చేస్తానని ఆయన అప్పట్లో ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా పోరాటం చేస్తానన్నారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని సైతం అప్పట్లో గంటా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.