పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 28 మంది విద్యార్థులకు అస్వస్థత!

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ప్రాథమిక - Food poisoning in a primary school in Adilabad district

Update: 2022-03-09 12:18 GMT

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 28 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని తాంసీ మండలం గోటు కూరి ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనంలో ఏజెన్సీ నిర్వాహకులు పప్పు, అలచంద అన్నం వండి పెట్టారు. ఇది తిన్న విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొన్నారు.



Tags:    

Similar News