Balka Suman: ఆ పంటలతో రైతులు అధిక లాభాలు పొందవచ్చు: ఎమ్మెల్యే బాల్క సుమన్

దిశ, క్యాతన్ పల్లి: ఆయిల్ పామ్ తోటలతో రైతులు అధిక లాభాలు గడించవచ్చని- Latest Telugu News

Update: 2022-04-08 09:09 GMT

దిశ, క్యాతన్ పల్లి: ఆయిల్ పామ్ తోటలతో రైతులు అధిక లాభాలు గడించవచ్చనిఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మందమర్రి మండలంలోని చిర్రకుంట గ్రామంలో మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా కోఆర్డినేటర్ అత్తి సరోజ 30 ఎకరాల వ్యవసాయ భూమిలో శుక్రవారం ఆయిల్ పామ్ తోటలో మొక్కలను ఆయన నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ తోటను పెంచడానికి రైతులు ముందుకొస్తే ఉద్యాన శాఖ రాయితీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. రైతులు తమ ఆదాయం రెట్టింపవ్వాలంటే వాణిజ్య సాగువైపు మొగ్గు చూపాలని సూచించారు. ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని తెలంగాణ సర్కార్ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, ఎంపీపీ మంగ, జడ్పీటీసీ వేల్పుల రవి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News