వైసీపీ పాలకుల వైఖరితో శిథిలాలే మిగులుతున్నాయి: చంద్రబాబు ఫైర్

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు అడ్డే లేకుండా పోతోందని టీడీపీ అధినేత..latest telugu news

Update: 2022-03-27 13:42 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు అడ్డే లేకుండా పోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా వైసీపీపై మండిపడ్డారు. కూల్చడం తప్ప కట్టడం రాని ఈ పాలకుల వైఖరితో శిథిలాలే మిగులుతున్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్న పేటలో నిర్మాణంలో ఉన్న ఎర్రన్నాయుడు చిల్డ్రన్ పార్క్‌‌లో కూల్చివేతలు దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ బరితెగింపును అడ్డుకోలేని అధికారులు ప్రజలకు ఏం సమాధానం చెప్తారన్నారు. బాధ్యులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతుంటే డిప్యూటీ సీఎంగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏమి చేస్తున్నారు? అని నిలదీశారు. మీకు ఓట్లేసింది ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలకు కాదని ఈ విషయం ప్రభుత్వం గుర్తించాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News