భైంసాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. పాల్గొన్న అంబేద్కర్ మనవడు

Update: 2022-03-04 11:04 GMT

దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణానికినిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణానికి ముందర గల స్థలంలో ఏర్పాటు చేసిన 11 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ మనవడు అడ్వకేట్ ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పవర్ రామారావు పటేల్, బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్, అద్దంకి దయాకర్, అంబేద్కర్ స్టాచ్యూ కమిటీ సభ్యులు, ప్రముఖులు, అంబేద్కర్ అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుండి ప్రజలు భారీ ర్యాలీగా బయలుదేరి భైంసా పట్టణంలోని మార్కెట్ యార్డ్ కు బయలుదేరారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో పలువురు మాట్లాడుతూ... అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని, రాజ్యాంగం రచించడంలో తన పాత్ర ఎనలేనిదని కొనియాడారు. దేశానికి దిశానిర్దేశం చేసింది రాజ్యాంగంమే అని కొనియాడారు. సభలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News