హడలెత్తిస్తున్న అడవి జంతువు.. ఇప్పటికే 40కి పైగా మేకలు, గొర్రెలు హతం..

దిశ, వంగూరు : నాగర్ కర్నూలు జిల్లా, వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో..latest telugu news

Update: 2022-03-24 13:50 GMT

దిశ, వంగూరు : నాగర్ కర్నూలు జిల్లా, వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో వరుసగా ఓ అడవి జంతువు మేకలు, గొర్రెలపై దాడులకు పాల్పడుతూ హతమారుస్తూ ఉంది. బుధ, గురు వారాలలో వరుసగా శ్యామ బాల చంద్రయ్య అనే వ్యక్తికి సంబంధించిన ఏడు గొర్రెలను ఒక రోజు, మరో రోజు ఆరు గొర్రెలను హతమార్చింది. గత 25 రోజుల నుండి ఆ జంతువు జరిపిన దాడుల్లో 40కిపైగా గొర్రెలు, మేకలు మరణించాయి.

ఈ విషయంపై స్పందించిన అటవీశాఖ అధికారులు గొర్రెలు, మేకలపై జరిగిన దాడులు, అడుగుజాడలను గుర్తించి పాల్పడుతున్నది చిరుత పులి కాదు అని.. హైన వంటి అడవి జంతువు దాడులకు పాల్పడుతూ గొర్రెలు, మేకలను హతమార్చినట్లు గుర్తించారు. గొర్రెలు మేకలు ఎక్కడ ఉంటే అక్కడికి ఆ అడవి జంతువు వచ్చి దాడులకు పాల్పడుతోందని, ఆ జంతువు నుండి తమ గొర్రెలు మేకలను రక్షించుకునేందుకు అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News