తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించిన జనసేన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను జనసేన పార్టీ ప్రకటించింది. ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది.

Update: 2023-11-07 15:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను జనసేన పార్టీ ప్రకటించింది. ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. కోదాడ నియోజకవర్గం నుంచి మేకల సతీశ్ రెడ్డి, ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, నాగర్ కర్నూల్ నుంచి వంగా లక్ష్మణ్ గౌడ్, వైరా నుంచి సంపత్ నాయక్, కొత్తగూడెం నుంచి లక్కినేని సురేందర్ రావు, కూకట్‌పల్లి నుంచి ప్రేమ్ కుమార్, తాండూరు నుంచి శంకర్ గౌడ్, అశ్వారావు పేట నుంచి మూగబోయిన ఉమాదేవిని ఖరారు చేశారు. కాగా, ఈసారి ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో జనసేన మొదటిసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనుంది.



 



Tags:    

Similar News