గవర్నర్ ఉగ్రరూపం.. కేసీఆర్ సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు

బీఆర్ఎస్ సర్కార్‌పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌గా తెలంగాణలో తాను అడుగుపెట్టిన సమయానికి కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి కూడా లేదని అన్నారు.

Update: 2023-09-30 07:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సర్కార్‌పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌గా తెలంగాణలో తాను అడుగుపెట్టిన సమయానికి కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి కూడా లేదని అన్నారు. తాను వచ్చాక ఇద్దరు మహిళా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించానని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రావడంతో ఇద్దరు మహిళలకు మంత్రులుగా అవకాశం రావడం సంతోషం అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రొటోకాల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా నా పని నేను చేసుకుంటూ పోతా అని స్పష్టం చేశారు. నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా, నాపై దాడి చేస్తే ఆ రక్తాన్ని సిరాగా వాడుకుని, ఆ రక్తంతో నా చరిత్ర నేనే రాసుకుంటా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News