వినాయక చవితి వేళ రాష్ట్ర ప్రజలకు సీఎం కీలక పిలుపు

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. వినాయక చవితి హిందువులకు పవిత్రమైన పండుగ అని పేర్కొన్నారు.

Update: 2023-09-18 03:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. వినాయక చవితి హిందువులకు పవిత్రమైన పండుగ అని పేర్కొన్నారు. గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు గణనాథుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ నవరాత్రి ఉత్సవాలను ఐక్యంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో కంటే ఈసారి పండగను ఎక్కువ సంఖ్యలో జరుపుకుంటుండటంతో పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు.

Tags:    

Similar News