గజ్వేల్ ఓటర్లు తరిమేస్తారని దొరకు అర్థమైంది: YS షర్మిల సెటైర్

గజ్వేల్ ఓటర్లు తన్ని తరిమేస్తారని దొరకు బాగా అర్థమైనట్టుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

Update: 2023-08-21 13:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గజ్వేల్ ఓటర్లు తన్ని తరిమేస్తారని దొరకు బాగా అర్థమైనట్టుందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. అందుకే ముందు జాగ్రత్తగా రెండో స్థానం నుంచి పోటీ చేస్తున్నారని ఇవాళ ట్విట్టర్ వేదికగా తెలిపారు. స్వయానా ముఖ్యమంత్రికే సొంత నియోజకవర్గంలో గెలుస్తాననే దమ్ము లేకపోవడం కేసీఆర్ పదేళ్ల దిక్కుమాలిన పరిపాలనకు నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అనడానికి సంకేతమన్నారు.

దొర ఇన్నాళ్లు గజ్వేల్ ప్రజలను కలిసింది లేదని, వాళ్ళ గోసలు తెలుసుకున్నది లేదన్నారు. పేరుకు ముఖ్యమంత్రి నియోజకవర్గమైనా డబుల్ బెడ్ రూం, దళిత బంధు రాలేదన్నారు. ఇక దొర గజ్వేల్‌లో చూపెట్టే అభివృద్ధి అంతా ఖాళీ బిల్డింగులే అని, రాష్ట్రానికే ముఖ్యమంత్రిని అన్న అహంకారంలో కేసీఆర్ గజ్వేల్‌కి ఎమ్మెల్యే అన్న సంగతి ఏనాడో మరిచిపోయాడని విమర్శించారు. నిజంగా దమ్ముంటే కేసీఆర్.. తన పరిపాలన మీద తనకు నమ్మకం ఉంటే.. సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచే గెలిచి చూపించాలని సవాల్ చేశారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News