ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడుతాం: TPCC చీఫ్ రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రేవంత్ రెడ్డి మరోసారి ప్రగతి భవన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-02-09 14:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రేవంత్ రెడ్డి మరోసారి ప్రగతి భవన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. హాత్ సే హాత్ యాత్రలో భాగంగా గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడుతామని.. ప్రగతి భవన్‌పై కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామన్నారు. ప్రగతి భవన్‌లోకి తెలంగాణ ప్రజలను ఎందుకు నిషేదించారని ప్రశ్నించారు. ప్రగతి భవన్ అడ్డాగా జరుగుతోన్న గూడు పుఠాణీ ఏంటని నిలదీశారు. సీఎం కేసీఆర్ పేదల చెమట వాసన రుచించదా అని అన్నారు. దోచుకునే వాళ్లకి మాత్రం ప్రగతి భవన్‌లో ఎర్ర తివాచీ వేసి స్వాగతం పలుకుతున్నారని ఫైర్ అయ్యారు.

ఇదిలా ఉండగా.. నక్సలైట్లు ప్రగతి భవన్‌ను కూల్చేయాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. గురువారం అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ రేవంత్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీశారు. ఇదిలా ఉండగానే.. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీ- కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. రేవంత్ రెడ్డి అలా మాట్లాడాల్సి ఉండాల్సి కాదు అని అభిప్రాయపడ్డారు. 

Also Read...

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రియాక్షన్ ఇదే! 

Tags:    

Similar News